
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
నెల్లూరు పార్లమెంట్ టీడీపీ మాజీ అధ్యక్షులు, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి తల్లి ఇటీవల మరణించారు. కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఈరోజు నెల్లూరులోని అబ్దుల్ అజీజ్ ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు.టిడిపి నెల్లూరు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ రూబీ, రాష్ట్ర ముస్లిం మైనార్టీ అధికార ప్రతినిధి షేక్ రఫీ, కందుకూరు పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ సలాం, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు షేక్ మున్నా, 7వ వార్డు అధ్యక్షుడు షేక్ గౌస్ బాషా తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.