
తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:-
ఉలవపాడు మండలం మన్నేటికోట గ్రామంలో మహాశివరాత్రి పండగ పర్వదినం సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుకూరు నియోజకవర్గం వైయస్ఆర్ సీపీ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ బాలకోటయ్య సంఘం, వైయస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమరలింగేశ్వర స్వామి ఆలయము ను దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఉలవపాడు మండల నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.