
తొలి శుభోదయం సింగరాయకొండ:-
అమేచూరు కుస్తీ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 2 మరియు 3 తేదీల్లో చిత్తూరు జిల్లా DSA గ్రౌండ్లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సీనియర్ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కుస్తీ పోటీల్లో సింగరాయకొండకు చెందిన ప్రతిభావంతులు అద్భుత విజయాలను నమోదు చేశారు.ఈ పోటీల్లో 82 kg Greco–Roman విభాగంలో పాల్గొన్న కుంచాల వంశీ గోల్డ్ మెడల్ సాధించి సింగరాయకొండ మండలానికి గౌరవం తీసుకువచ్చాడు. అదే విభాగంలో పోటీ పడి కుంచాల బ్రహ్మ శ్రీను సిల్వర్ మెడల్ సాధించి ప్రతిభ చాటాడు.స్టేట్ స్థాయి పోటీలలో విజేతలుగా నిలిచిన వీరిరువురు డిసెంబర్ 12 నుండి 14 వరకు గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో జరుగనున్న WFI నేషనల్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్కై ఎంపిక కావడం ద్వారా రాష్ట్రాన్ని ప్రాతినిధ్యం వహించే అవకాశం పొందారు.స్థానిక క్రీడాభిమానులు, కోచ్లు, ప్రజాప్రతినిధులు ఈ విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ జాతీయ స్థాయిలో కూడా విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలియజేశారు.
