
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
గిద్దలూరు పట్టణ వాసులకు మరియు ఆస్తి పన్ను బకాయిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చిందని మున్సిపల్ కమిషనర్ ఈవి రమణబాబు తెలిపారు. ఏళ్ల తరబడి పేరుకుపోయిన ఇంటి పన్ను (ప్రాపర్టీ టాక్స్) బకాయిల మీద పడిన వడ్డీలో 50 శాతం రాయితీని కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని,
ఈ అద్భుత అవకాశాన్ని గిద్దలూరు పట్టణ ప్రజలు ఉపయోగించుకొని తమ బకాయిలను వెంటనే చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ రమణబాబు ప్రజలను కోరారు.