
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ప్రకాశం జిల్లా టంగుటూరు సమీపంలో టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు ప్రయాణిస్తున్న పెట్రోలింగ్ వాహనం బోల్తా పడిన విషయం తెలిసిందే. ఒంగోలులోఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఎస్సై నాగమల్లేశ్వరరావును మంత్రి స్వామి శుక్రవారం పరామర్శించారు. జరిగిన సంఘటనను అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో భాగంగా వారెంట్ ముద్దాయిని ఛేజ్ చేసే క్రమంలో కారు బోల్తా పడిందని తెలిపారు.