
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
పేదవారి సహయార్ధం నిర్వహిస్తున్న ఎన్నో కార్యక్రమాల్లో కందుకూరు పట్టణంలో ఆదివారం ప్రతి ఇంటిలో బట్టలు పాతవి కొత్తవి వారికి సరిపోనివి, ఉపయోగపడనివి సేకరించి ఐ.ఎఫ్.సి ఫౌండేషన్ వారికి అందించడం జరిగింది.సంస్థ నిర్వాహకులు అందరూ కలిసి ఆ బట్టలని ఊరి బయట గుడిసెలలో నివాసం ఉండే వృద్ధులకు, పిల్లలకు బట్టల అవసరం ఉందో తెలుసుకొని వారికి అందించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి మేము సైతం అంటూ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి సంస్థ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సాజిద్, సెక్రటరీ షంషేర్, ట్రజరర్ హఫీజ్, ఇంచార్జ్ అయూబ్ ఖాన్ పఠాన్, షoషూద్దీన్ పాల్గొన్నారు.