
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ప్రకాశం రీజియన్ ఒంగోల్ కార్గో సెంటర్ లో పార్సిల్ కొరియర్ సర్వీసు డెలివరీ కౌంటర్lలలోఐదు స్విఫ్ట్ లలో 20 మంది సిబ్బంది విధులను నిర్వహిస్తున్నారు. ఉదయము 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సిబ్బంది విధులను నిర్వహించవలసిఉంది. కొందరు సిబ్బంది కబుర్లు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారని పలువురు నుంచి సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.పార్శిల్ లను ఇవ్వమని అడిగితే వ్యక్తులపై సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని పలువురు వాపోతున్నారు. మేము ఇంతే మేము మారమని కార్గో సెంటర్ కు వారిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలే సిబ్బంది చుక్కలను చూపిస్తున్నారు .
ఇప్పటికైనా ఆర్టిసి ఆర్ ఎం సత్యనారాయణ జోక్యం చేసుకొని కార్గో సెంటర్ సిబ్బంది విధులను సక్రమంగా నిర్వహించే విదoగా చూడాలని పలువురు కోరుతున్నారు.