
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, ఒంగోలు పట్టణంలో ఉన్న వివిధ ఏటీఎం కేంద్రాల్లో ప్రకాశం జిల్లా పోలీసులు భద్రతా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలను పీసీఆర్ ఎస్ఐ పి. రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.తనిఖీల సందర్భంగా ఏటీఎం కేంద్రాల్లో సీసీ కెమెరాల పనితీరు, లైటింగ్ వ్యవస్థ, భద్రతా ఏర్పాట్లు మరియు పరిసరాల పర్యవేక్షణను పోలీసులు పరిశీలించారు.ఏటీఎం కేంద్రాల వద్ద అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని బ్యాంకు సిబ్బంది మరియు భద్రతా సిబ్బందికి సూచనలు చేశారు.ప్రజల భద్రత, ఆర్థిక లావాదేవీల రక్షణే లక్ష్యంగా ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగిస్తామని ప్రకాశం జిల్లా పోలీసులు తెలిపారు.