
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పట్టణంలోని TRR ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) వేదికగా మంగళవారం నాడు జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ఎన్.ఎస్.ఎస్. (NSS) విభాగం మరియు రెండవ సచివాలయం వైద్య ఆరోగ్య సిబ్బంది సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు నులి పురుగుల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా రక్తహీనత మరియు ఎదుగుదల లోపాలను వివరించడంతో పాటు, వ్యక్తిగత పరిశుభ్రత పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. రవి కుమార్ పాల్గొని ప్రసంగిస్తూ, విద్యార్థుల శారీరక ఆరోగ్యం వారి విద్యాభ్యాసంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని, అందుకే ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆరోగ్య సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఎన్.ఎస్.ఎస్ కోఆర్డినేటర్ కోటపాటి నరేష్ రాజా మరియు రెండవ సచివాలయం వైద్య ఆరోగ్య సిబ్బంది సుధాకర్ మరియు కళ్యాణి సమక్షంలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, వైద్య సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
