
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం జిల్లాకు నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన విజయ సునీత (ఐఏఎస్) ను అఖిల భారత మాల సంఘాల జేఏసీ మార్కాపురం జిల్లా అధ్యక్షులు నందం శేఖర్ శనివారం న ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకం గా కలసి దృశ్యాలువ,పూలమాల తో ఘనంగా సన్మానించి,భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని బహూకరించారు.నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాకు తొలి మహిళ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించడం ఈ జిల్లాకు శుభపరిణామం అని తెలిపారు.అభివృద్ధి కి నోచుకోని పశ్చిమ ప్రాంతమైన మార్కాపురం దశాబ్దాల కాలం నుండి అనేక పోరాటాల ఫలితంగా జిల్లా ఏర్పడిందని తెలిపారు..జిల్లా అభివృద్ధి కోసం పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. నందం శేఖర్ ..ఈ కార్యక్రమంలో. చల్లగాలి విద్యాసాగర్ మూల జోర్ణస్,అక్కల వెంకటేశ్వర్లు,గొట్టేముక్కుల శ్రీనివాసులు,బద్దెపూడి డేవిడ్ రాజు,బళ్లాని రమణ, తదితరులు పాల్గొన్నారు..