
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
కందుకూరు టౌన్ ఆది ఆంధ్ర కాలనికి చెందిన వైస్సార్సీపీ సీనియర్ నాయకుడు, వార్డ్ క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులు కుడుముల మాలకొండయ్య అనారోగ్యం కారణంగా మరణించిన విషయం తెలుసుకొని వారి ఇంటికి వెళ్లి ఆయన పార్థివ దేహానికి ఘనంగా నివాళులు అర్పించిన మాజీ శాససభ్యులు, కందుకూరు నియోజకవర్గం వైస్సార్సీపీ ఇంచార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండయ్య విడిచి వెళ్లిన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నాను అని అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ తోకల కొండయ్య, రాష్ట్ర బూత్ సహాయ కార్యదర్శి గణేశం గంగిరెడ్డి, నియోజకవర్గ రైతు అధ్యక్షులు నల్లమోతుల చంద్రమౌళి, క్రిస్టియన్ మైనారిటీ నియోజకవర్గ అధ్యక్షులు ఉచ్చులూరి రవీంద్ర ,అప్పనబోయిన రాజేష్, కందుకూరు పట్టణ ఎస్సీ సెల్ జనరల్ సెక్రెటరీ జంగిలి సుబ్బారావు,వార్డు అధ్యక్షులు గౌడపేరు. క్రాంతి కుమార్, సీనియర్ నాయకులు వంకాయలపాటి మోషే, రేణమాల శింగయ్య, సూరపోగు అఖిల్,అత్యాల సురేష్, అత్యాల కిషోర్, తాటిపర్తి కోటేశ్వరరావు వార్డు కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు.