
తొలి శుభోదయం న్యూస్ కొండ బిట్రగుంట,:-
నెల్లూరు జిల్లా,బోగోలు మండలం కొండ బిట్రగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సూర్యప్రభ వాహన సేవను ఆలయ అధికారులు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి వాహన సేవను దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తుల రద్దీతో కళకళలాడింది. “గోవింద గోవింద” నామస్మరణల మధ్య స్వామివారి సూర్యప్రభ వాహన సేవ ఘనంగా సాగింది.