
తొలి శుభోదయం సింగరాయకొండ:-
సింగరాయకొండలోని గీతం స్కూల్లో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ–విద్యార్థులు తెలుగు సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా వివిధ సాంప్రదాయ వేషధారణలతో అలరించారు. వారి ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గీతం స్కూల్ చైర్మన్ లక్ష్మణ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, సంక్రాంతి పండుగకు తెలుగు రాష్ట్రాలలో విశేషమైన ప్రాధాన్యత ఉందన్నారు. ఈ రోజున సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ఈ పండుగను మకర సంక్రాంతిగా జరుపుకుంటామని తెలిపారు. పండుగలు మన సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలకు తెలియజేసే గొప్ప అవకాశం అని ఆయన పేర్కొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ముందస్తుగా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ తాజుద్దీన్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, విద్యార్థినీ–విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
