
యువతను చెడు అలవాట్ల నుంచి దూరం చేయడంలో పోలీసుల ప్రత్యేక దృష్టి
చెడు నడతగల వ్యక్తులకు(రౌడీ షీటర్స్) కౌన్సెలింగ్ – మార్పు దిశగా పోలీసుల ప్రయత్నం
శాంతిభద్రతల పరిరక్షణ, నేరాలు నియంత్రణలో రాజీ ప్రసక్తి లేదు…చట్టాన్ని అతిక్రమిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవు:జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్.
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం & మార్కాపురం పోలీస్:-
ప్రకాశం మరియు మార్కాపురం జిల్లాలలో పోలీసు శాఖ యొక్క మార్చి 01.03.2026 నుండి 31.03.2026 వరకు మాసపు గణాంకాలు
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుంది. జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు ప్రకాశం, మార్కాపురం జిల్లాలలో పోలీసులు విస్తృత తనిఖీలు – చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై చర్యలు చేపట్టారు.జిల్లా వ్యాప్తంగా రాత్రి, పగలు గస్తీ నిర్వహిస్తూ మొత్తం 11,741 మంది అనుమానితులను MSCD ద్వారా తనిఖీ చేయగా, వారిలో 18 మంది పాత కేసుల నిందితులను గుర్తించారు. వీరిని పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ జరిపి, అవసరమైన మేరకు బైండ్ ఓవర్ చేయడం, కౌన్సెలింగ్ నిర్వహించటం జరిగింది.గంజాయి అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా 4 కేసులు నమోదు చేసి 10 మంది నిందితులను అరెస్ట్ చేసి సుమారు 24.375 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా టాస్క్ ఫోర్స్ మరియు రైల్వే పోలీసుల సంయుక్త తనిఖీలలో రైళ్లలో సుమారు 13 కిలోల గంజాయిని పట్టుకోవటం జరిగింది. జిల్లాలో కోడిపందాలు, పేకాట మరియు మట్కా వంటి జూద కార్యకలాపాలపై ప్రత్యేక దాడులు నిర్వహించి మొత్తం 179 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా 37 కేసులు నమోదు చేయబడగా, వారి వద్ద నుండి రూ. 4,55,550/- నగదు, 12 కోళ్లు, 22 మోటార్ సైకిళ్లు, 14 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రకాశం,మార్కాపురం జిల్లాలలో ఉన్న 878 మందిని చెడునడతగల వారికి (రౌడీ షీటర్ల) కౌన్సిలింగ్ నిర్వహించి,నేరాల నుండి దూరంగా ఉండాలని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన వారిపై 2,078 కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి కార్యకలాపాలు జరుగుతున్న 615 ప్రదేశాలను గుర్తించి శుభ్రపరచడం జరిగింది.రోడ్లను ఆక్రమించి ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్న 1,954 మంది చిరు వ్యాపారులపై టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి కోర్టులో జరిమానాలు, శిక్షలు విధింపజేశారు.మోటారు వాహన చట్టం కింద ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలపై మొత్తం 10,805 ఈ చలానా ద్వారా కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 361 మంది వాహనదారులను పట్టుకుని గౌరవ కోర్టులో హాజరు పరచగా గౌరవ కోర్ట్ వారు జరిమానాలు/జైలు శిక్ష విధించారు.
డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు తమ పరిధిలో గ్రామాలు, వార్డులను సందర్శించి ప్రజలతో ముఖాముఖి మాట్లాడి గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల అనర్థాలు, చట్టపరమైన శిక్షలు గురించి అవగాహన కల్పించారు.అలాగే సైబర్ నేరాలు, లోన్ యాప్స్, క్రికెట్ బెట్టింగ్, రహదారి భద్రత నియమాలు, హెల్మెట్ వినియోగం, కొత్త క్రిమినల్ చట్టాలపై విస్తృత ప్రచారం నిర్వహించారు.చట్టాన్ని అతిక్రమించే వారిపై ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. స్పష్టం చేశారు.