
తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
దర్శి పట్టణం కురిచేడు రోడ్ లోని ఆంజనేయస్వామి సర్కిల్ వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో డా. కడియాల లలిత్ సాగర్, నారపుశెట్టి పాపారావు, మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య తదితర నాయకులు పాల్గొన్నారు.ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తాగునీరు అందించేందుకు పట్టణంలో పలు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.