
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
స్వాతంత్ర సమరయోధుడు సంఘసంస్కర్త రాజకీయవేత్త దళిత బడుగు బలహీన వర్గాల ప్రజాప్రతినిధి భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రావ్ 118 వ జయంతి సందర్భంగా కందుకూరు పట్టణంలోని చర్చి సెంటర్ నందుగల జగజ్జీవన్ రావ్ విగ్రహానికి విగ్రహ కమిటీ, జాషువా సాహిత్య సాంస్కృతిక సంస్థ, ముస్లిం ఐక్యవేదిక, హెల్ప్ సపరర్స్ సొసైటీ ఆధ్వర్యంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ సలహాదారులు ముప్పవరపు కిషోర్, ముస్లిం ఐక్యవేదిక అధ్యక్షులు షేక్ మహబూబ్ బాషా, జగజీవన్ రామ్ విగ్రహ కమిటీ అధ్యక్షులు గౌడపేరు ఏసు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ రఫీ , ఏ ఏ డి అసోసియేషన్ గౌరవాధ్యక్షులు గేరా.చిరంజీవి,బహుజన టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్. అబ్దుల్లా, కందుకూరి భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు తొండల ఆదాము, దమ్మచక్ర ఫౌండేషన్ అధ్యక్షులు గాండ్ల హరిప్రసాద్ లు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం ఏఏడి అసోసియేషన్ ఉపాధ్యక్షులు చనమాల కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ ఏ పదవిని అలంకరించిన దానికి వన్నె తెచ్చే విధంగా వ్యవహరించే వారని, ఆధునిక భారత నిర్మాణానికి అహర్నిశలు పనిచేసిన సుదీర్ఘకాల పార్లమెంటేరియనని ఆయన సేవలను కొనియాడారు. భారతదేశ హరిత విప్లవానికి నాంది పలికిన వాడని, కార్మిక సంక్షేమానికి పునాది వేసిన వాడని, అనేక భారత గ్రామీణ కార్మిక ఉద్యమాలను నిర్మించాడని, అంటరాని వారి సమానత్వం కోసం ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించి అంకిత భావంతో పనిచేశాడు. హిందూ మహాసభ సెషన్స్ లో దళితుల పట్ల వివక్షత ప్రదర్శించకూడదని వారికి కూడా దేవాలయాల్లో ప్రవేశం కల్పించాలని తాగునీటి బావుల్లో వివక్షత ప్రదర్శించకూడదని క్రియాశీలకంగా ఉద్యమాలు నడిపాడు. సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని జైలు శిక్షణ సైతం ఎదుర్కొన్న దీరోధాత్రుడు జగజ్జీవన్ రామ్ అని అన్నారు. ఆ మహానుభావుడు సాధించిన హక్కులు నేడు పాలకవర్గాలు కాలరాస్తున్నాయని రాజ్యాంగం తుంగలో తొక్కబడుతున్నాదని పాలకవర్గ కుట్రలను ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ ప్రజలు సమిష్టిగా ఎదుర్కొని హక్కులను కాపాడుకోవాలని అన్నారు. మతం మారితే షెడ్యూల్ కులాల వారు తమ రక్షణ చట్టాలను విద్య ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కోల్పోతారని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగము యొక్క మౌలిక స్వభావాన్నికీ భిన్నంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఇంట్లెక్చువల్ ఫోరం జిల్లా అధ్యక్షులు రావులకొల్లు బ్రహ్మానందం, కొత్త నెత్తురు రచయిత బద్దిపూడి జయరావు, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి గేరా మనోహర్, క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులు ఉచ్చులూరి రవీంద్ర, క్రిస్టియన్ మైనారిటీ సీనియర్ నాయకులు కొండేటి కరుణాకర్, ఎస్సీ సెల్ పట్టణ ప్రధాన కార్యదర్శి జంగిలి సుబ్బారావు, డాక్టర్స్ విభాగం ప్రధాన కార్యదర్శి సూరపోగు సహజానందం, వైసిపి అధ్యక్షులు గౌడపేరు క్రాంతి కుమార్, ప్రధాన కార్యదర్శి ముప్పవరపు కోటేశ్వరరావు, దళిత నాయకులు ముప్పవరపు రమేష్, బహుజన టీచర్ అసోసియేషన్ నాయకులు కల్లగుంట మోహన్ రావు, గుడిపూడి అంజయ్య, రమణయ్య, నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు వల్లూరి కోటేశ్వరరావు, సిహెచ్ సురేష్ ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ రహీం, షేక్ నయీమ్, ఆలూరి సుందర్రావు, కావూరి కోటేశ్వరరావు, తలారి జకరయ్య,మంచికలపాటి పెద రాములు, రోడ్డా. సుదర్శనం, వైయస్సార్సీపి ఎస్టి నాయకుడు దేవరకొండ.దత్తాత్రేయ, ఎస్సీ సెల్ అధ్యక్షులు సూరపోగు రాజశేఖర్, గౌడసంఘ నాయకులు కానాల ప్రసాదు, దగ్గుమాటి కళ్యాణ్, సూరపోగు సుధాకర్, బక్కా. సుబ్బారావు, ముతకాని లక్ష్మి నారాయణ వైయస్సార్ సిపి ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు ఎండ్లూరి కొండయ్య, ముస్లిం ఐక్యవేదిక నాయకులు వి. నయీముల్లా, షేక్ అలంకార్, షేక్ నజీర్, షేక్ హజీబుల్లా (DE), షేక్ రహంతుల్లా, షేక్ మునీర్, షేక్ నయీమ్, షేక్ జిలాని, షేక్ మదర్ అంగన్వాడి అధ్యక్షురాలు దేవరకొండ ఆదిలక్ష్మి, ఆర్.ఎం.పీ డాక్టర్ సంఘ నాయకురాలు బిరుదుల సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.