
తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:-
కనిగిరి కి చెందిన జర్నలిస్టు నూకతోటి నాగరాజు రైలు ప్రమాదంలో మృతిచెందగా ఆయన మృతదేహాన్ని స్వగ్రామం పీసీ పల్లి మండలం పెదవరిమడుగుకు కుటుంబ సభ్యులు తరలించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పిసి కేశవరావు, కనిగిరి పట్టణ కమిటీ సభ్యులు నరేంద్ర, నారాయణలు నాగరాజు పార్థివ దేహాన్ని ఆదివారం సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. మృతుడు నాగరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అందరితో ఆప్యాయంగా మెలిగే వాడని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం వృత్తిపరంగా శ్రమించే నాగరాజు రైలు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.