
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
శ్రీ గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ సి.హెచ్. భరద్వాజ్ విద్యార్థిని మరియు సిబ్బందిని ప్రశంసిస్తూ, ఇలాంటి మరెన్నో అవార్డులు సాధించి పాఠశాలకు మరింత గౌరవం తీసుకురావాలని సూచించారు. విద్యార్థులు మరియు సిబ్బంది కృషి ఎల్లప్పుడూ అభినందనీయం, గొప్పదని తెలిపారు.ఈ సందర్భంగా శ్రీ గాయత్రి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఏజీఎం బి. సురేష్ ఆమెను సన్మానించి ₹5,000 నగదు బహుమతి మరియు జ్ఞాపిక అందజేశారు.పాఠశాల హెడ్ మిస్ట్రెస్ ఆర్. నీలు కుమారి ఈ విజయానికి విద్యార్థిని కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వమే కారణమని అభినందించారు.అదేవిధంగా, మరికొంత మంది విద్యార్థులు కూడా గణిత ఒలింపియాడ్ పరీక్షలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. వారికి సర్టిఫికేట్లు మరియు జ్ఞాపికలు అందజేశారు.