
తొలి శుభోదయం కందుకూరు:-
టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కందుకూరు నందు ఈనెల 8వ తారీఖున పూర్వ విద్యార్థుల సమావేశం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. రవికుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున కందుకూరు మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థులందరూ టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఫిబ్రవరి 8వ తేదీన 10.00 గంటలకు జరుగు సమావేశానికి హాజరు కాగలరు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ ఈ సమావేశానికి హాజరవగలరని, ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో కోరారు.