
తొలి శుభోదయం కందుకూరు:-
టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత విభాగం వారి ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఇందులో భాగంగా వంటల పోటీలు మరియు ముగ్గుల పోటీలు నిర్వహించబడ్డాయి. వంటల పోటీలో ప్రధమ, ద్వితీయ , తృతీయ స్థానాల్లో విజేతలైన వారికి మరియు ఒక ప్రోత్సాహక బహుమతిని మహిళా సాధికారత విభాగం వారు అందజేయనుండగా ఒక ప్రత్యేక బహుమతిని వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నరేంద్ర ఏడుకొండలు అందజేయనున్నారు. ఈ పోటీలో పాల్గొన్న మిగతా వారందరికీ కళాశాల ఐక్యుఏసి కోఆర్డినేటర్ మరియు ఆంగ్ల అధ్యాపకులు డాక్టర్ పి. రాజగోపాల్ బాబు బహుమతులు అందజేయనున్నారు. ముగ్గుల పోటీలలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో విజేతలైన విద్యార్థులకు మహిళా సాధికారత విభాగం వారు బహుమతులు అందజేయనున్నారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కళాశాలలోని రసాయన శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ కేవీ పద్మావతి బహుమతులు అందజేస్తున్నారు. కళాశాలలో నిర్వహించిన రాజ్యాంగ పీఠిక పఠన పోటీలలో విజేతలైన మరియు పాల్గొన్న విద్యార్థులకు కళాశాల ఐ క్యు ఏసి కోఆర్డినేటర్ డాక్టర్ పి రాజగోపాల్ బాబు బహుమతులు అందజేస్తున్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం రవికుమార్ ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు అందరినీ అభినందించారు. కళాశాలలో నిర్వహింపబడిన విభిన్న రకాలైన ఈ పోటీలు కళాశాలలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుందని వారు తెలియజేశారు. మహిళా సాధికారత విభాగం కన్వీనర్ డాక్టర్ కే. సుజాత, రాజనీతి శాస్త్ర విభాగం అధ్యాపకులు కే నరేష్ రాజాల ఆధ్వర్యంలో నిర్వహించిన,ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో కళాశాలలోని అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు
