
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
రాజంగా సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారి జయంతి సందర్భంగా సింగరాయకొండ గ్రామ పంచాయతీ నందు గ్రామ సభ నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో సింగరాయకొండ గ్రామ ప్రజల సమస్యల పై మరియు వేసవి కాలంలో మంచినీటి సమస్య పారిశుద్ధ సమస్య, పంచాయతీ అభివృద్ధి, కార్మికుల సమస్య పలు విషయాల పై చర్చిండం జరిగినది. ఈ కార్యక్రమంనికి సింగరాయకొండ మండల తహసీల్దార్ (మెజిస్ట్రేట్), మరియు సింగరాయకొండ గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి అయిన రాజేష్ , మరియు సింగరాయకొండ గ్రామ పంచాయతీ అధికారి డిప్యూటీ ఎంపీడీవో శారద మరియు సింగరాయకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ , మండల ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీనివాస్ , టీడీపీ టౌన్ అధ్యక్షులు షేక్ ఎస్దాని , టీడీపీ నాయకులు చీమకుర్తి కృష్ణ , వివిధ హోదాలో ఉన్న కూటమి నాయకులు, పంచాయతీ సిబ్బంది, సచివాల సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగనవాడి టీచర్లు, ప్రజలు అందరూ పాల్గొనడం జరిగినది.