
తొలి శుభోదయం న్యూస్ బుచ్చిరెడ్డిపాలెం:-
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ పరిధిలో పార్టీ జెండాను ఆవిష్కరించి, మహానేత శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించాను.అనంతరం బాంబే రోడ్డులో నిర్వహించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కాంస్య విగ్రహ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నాను.తదుపరి KVR ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా కార్యకర్తలే అధినేతగా పార్టీకి విశేష సేవలందించిన సీనియర్ కార్యకర్తలను మెమెంటోలతో సత్కరించడం జరిగింది.