
తొలి శుభోదయం న్యూస్ దర్శి:-
దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలియజేస్తూ, దర్శి RTC బస్టాండ్లో “దివ్యాంగ శక్తి పథకం”ను డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగింది.ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ నాయకత్వంలో దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు.దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణిస్తూ వారి ఆనందాన్ని పంచుకున్న డాక్టర్ లక్ష్మీ, ఈ పథకం ద్వారా లక్షలాది మందికి ఆర్థిక ఉపశమనం కలుగుతుందని తెలిపారు.