
తొలి శుభోదయం న్యూస్ గుడ్లూరు:-
ప్రకాశం జిల్లా గుడ్లూరు మండల కేంద్రంలో బస్టాండ్ సెంటర్ లో ఉన్న పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వద్ద నేత్రపురి శ్రీరామసేవక్ మరియు యశ్వంత్ సాయి తేజ మెమోరియల్ ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో గుడ్లూరు వాస్తవ్యులు దామా సోమనాయుడు ధర్మపత్ని శ్రీలక్ష్మి వారి కుమారుడు కుమార్తెల సహకారంతో మధ్యాహ్నం వేళలో చల్లని మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా నేత్రపురి శ్రీరామసేవక్ కార్యనిర్వాహకులు మాట్లాడుతూ వేసవిలో కొందరి దాహర్తిని అయినా తీర్చాలన్న సంకల్పం తో మేము వేసవికాలం ముగిసే వరకు మంచినీటి చలివేంద్రాన్ని మరియు అలాగే వారానికి మూడు నుండి నాలుగు రోజులపాటు ఈ చల్లని మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నామని అందులో భాగంగా ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అని అన్నారు. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడైనటువంటి సోమా నాయుడు గారు తాను తన మిత్రులతో కలిసి గుడ్లూరు ప్రాంతంలో చైతన్య స్కూల్ ను స్థాపించి ఆ స్కూల్స్ ద్వారా ఎందరో విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేశారు.వారు ఈరోజు కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ కార్యక్రమానికి రాలేకపోయినందున తన మిత్రులు మరియు తన తోటి ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించారు. ఈ కార్యక్రమం ద్వారా మధ్యాహ్నం వేళలో దాదాపు 250 నుండి 300 మంది ప్రయాణికులకు చల్లని మజ్జిగను అందించారు. ఈరోజు ఈ కార్యక్రమనికి సహకరించినటువంటి వారి కుటుంబ సభ్యులకు,అలాగే ఇప్పటివరకు ఈ చల్లని మజ్జిగ మరియు మంచినీరు పంపిణీ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించిన దాతలు అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో యశ్వంత్ సాయి తేజ మెమోరియల్ ట్రస్ట్ అధ్యక్షులు అజయ్ బాబు గారు , నేత్రపురి శ్రీరామసేవక్ కార్యనిర్వాహకులు, ఇన్నమూరి సుధాకర్,ఎయిర్టెల్ చిన్న, ,ఇన్నమూరి గరటయ్య, అభ్యుదయ హై స్కూల్ హెడ్మాస్టర్ కలగారెడ్డి గారు చైతన్య స్కూల్ ఉపాధ్యాయులు శేషమ్మ టీచర్ గారు మరియు పాజర్ల బ్రహ్మం, ,గొల్ల.మణి కంఠ , మీడియా మిత్రుడు గుర్రం ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.