
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు మండలం, దొండపాడు గ్రామంలో పండుగ వాతావరణంలో జరిగిన 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నాను. నేరుగా లబ్ధిదారుల గడప వద్దకే వెళ్లి, నా చేతుల మీదుగా వారికి పింఛను అందజేయడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఒకటో తేదీనే పింఛను అందుకున్న మా అవ్వాతాతలు, అక్కాచెల్లెమ్మల ముఖాల్లో చిరునవ్వులు, ఆనందం చూస్తుంటే మనస్సుకు ఎంతో తృప్తిగా అనిపించింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు సకాలంలో, పారదర్శకంగా అందజేయడమే మన ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ప్రజా సేవలో ఇలాగే అంకితభావంతో ముందుకు సాగుతాం!