
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారితో… కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం విజయవాడలోని ఉండవల్లిలో భేటీ అయ్యారు. కందుకూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, ఇతర కార్యక్రమాల గురించి లోకేష్ గారికి నాగేశ్వరరావు వివరించారు. అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున నిధులు ఇస్తుండడంపట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా పెండింగ్ లో ఉన్న పనుల గురించి ప్రస్తావించిన నాగేశ్వరరావు… వాటికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.