
తొలి శుభోదయం న్యూస్ పల్నాడు:-
పల్నాడు జిల్లాలో ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణను కలెక్టర్ కృతిక శుక్లా స్వయంగా పర్యవేక్షించారు. పట్టణంలోని కాసు రాఘవమ్మ బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. పరీక్షా గదులను పరిశీలించారు. పరీక్షలు ఎటువంటి లోపాలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులకు తాగునీరు వంటి కనీస వసతుల్లో ఇబ్బంది కలగకూడదని అధికారులను ఆదేశించారు.