
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
టంగుటూరు టుబాకో బోర్డు లో పొగాకు కొనుగోలు పరిస్థితిని, రైతుల పడుతున్న బాధలను పరిశీలన చేయటం జరిగింది. ఈ సందర్బంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐ టీ సీ తో కుమ్మక్కు అవ్వటం వల్ల పొగాకు పంట మీద ఏటా 7500 కోట్ల రూ, ల ఆదాయం ఐ టీ సీ వాళ్ళ కు వస్తుంది అని తెలిపారు. ఒక పక్కన ఇంత ఆదాయం వస్తుంటే రెండో పక్కన రైతులు ఎందుకు నష్ట పోతున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మూలిగే నక్క పై తాటికాయ పడ్డట్టు, నష్టాల్లో ఉన్న పొగాకు రైతు లకీ 40% జిఎస్టీ వెయ్యటం దుర్మార్గం అని అన్నారు. పొగాకు పంట పైనే కేంద్ర ప్రభుత్వానికి 2500 కోట్ల రూ, ల పన్ను వస్తుంది అని తెలిపారు. ఇంత అధ్యాయం తెస్తున్న పొగాకు రైతులను ఆడుకొనేందుకు ఎస్ టీ సీ ని రంగం లోకి దించి 300 కోట్ల రూ, లు కేటాయించి కిలో పొగాకు ని 360 రూ, ల కు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో రైతుల ను కూడ గట్టి ఆందోళన చేస్తాము అని హెచ్చరిక చేసినారు. ఈ కార్యక్రమం లో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్కె. మాబు, ఏ. మాల్యాద్రి, కే. ఆంజనేయులు, మండల నాయకులు టీ. రాము, వి. మోజెస్, వి. సింగయ్య రైతులు బి. పున్నారావు, ఎమ్. కోటయ్య, వై. ఆనంద్, వి. బలరాం, ఏ. వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.