
పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (మీ కోసం) కార్యక్రమంకు 43 ఫిర్యాదులు
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
ప్రజల నుండి వచ్చే వివిధ రకాల ఫిర్యాదులను పరిష్కారించుటయే లక్ష్యంగా జిల్లా ఎస్పీ శ్రీ వి.హర్షవర్ధన్ రాజు ఐపియస్., ఆదేశాల మేరకు మార్కాపురం డి.ఎస్.పి యు.నాగరాజు, కనిగిరి డి.ఎస్.పి సాయి ఈశ్వర్ యశ్వంత్ మరియు పోలీస్ అధికారులు సోమవారం మార్కాపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో "మీకోసం"(PGRS) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో నలదిక్కుల నుండి వచ్చిన ఫిర్యాదులను పోలీస్ అధికారులు స్వీకరించి వారితో మాట్లాడి వారి ఫిర్యాదుల గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. అందిన ప్రతి పిర్యాదుపై చట్ట ప్రకారం విచారణ జరిపి, సత్వర పరిష్కారం కల్పిస్తామని బాధితులకు భరోసా కల్పించారు. అదేవిధంగా అందిన ఫిర్యాదుల వివరాలను సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులకు తెలియజేసి, చట్ట ప్రకారం విచారణ జరిపి భాదితులకు న్యాయం అందించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా భూ వివాదాలు, ఉద్యోగ మోసాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక మోసాలు, చీటింగ్ కేసులు మరియు ఇతర సమస్యలపై ప్రజలు ఫిర్యాదులు చేశారు. ప్రజల విశ్వాసం పెంపొందించడమే కాకుండా బాధితులకు తక్షణ సహాయం అందించడం పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయమని అధికారులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పొదిలి సీఐ యం.రాజేష్ కుమార్, త్రిపురాంతకం సీఐ అస్సాన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
