
తొలి శుభోదయం సింగరాయకొండ:-
ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించాలని ఆర్ టీసీ ఆర్ ఎం సత్యనారాయణ అన్నారు. సింగరాయకొండ బస్టాండ్ పరిసర ప్రాంతాలను గురువారం రాత్రి ఆయన పరిశీలించారు. ప్రయాణికుల పట్ల సిబ్బంది
మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. బస్సులను ప్రయాణికులు ఎక్కేప్పుడు దిగే ప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. బస్సులన్నీ బస్టాండ్ కి రావాలని ఆయన పేర్కొన్నారు. బస్సులసిబ్బంది
సమయ పాలన పాటించాలని తెలియజేశారు. ఆయన వెంట ఆర్టీసీ డిపో మేనేజర్ రాపూరి శ్రీనివాసరావు, తదితరులు ఉన్నారు.