
తొలి శుభోదయం :-
ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలం, బండ్లమూడి గ్రామం లో మాదిగల పై రెడ్డి కులస్తులు దాడి చేసిన ఘటనలో గాయపడిన బాధితులను పరామర్శించిన MRPS వ్యవస్థాపకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ , అనంతరం ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు గారితో మాట్లాడుతూ ఈ ఘటన వెనుక సూత్ర దారులను, పాత్రదరులను, కఠినంగా శిక్షించి మాదిగలకు న్యాయం చేయాలని కోరారు. పరామర్శించిన వారిలో MRPS వ్యవస్థాపక సభ్యులు కొమ్మూరి గరటయ్య మాదిగ, ప్రకాశం జిల్లా అధ్యక్షులు రావినూతల కోటి మాదిగ, ఎంఎస్ఎఫ్ స్టేట్ కన్వీనర్ పల్లెపోగు త్రిపుర మాదిగ, మల్లెల ప్రసాద్, బక్క రాజు, తదితరులు ఉన్నారు.
