
తొలి శుభోదయం న్యూస్ బాపట్ల:-
నైట్ ప్యాంటుతో విధులకు హాజరైన ఉద్యోగిని సస్పెండ్ చేయాలని బాపట్ల కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. స్థానిక 5వ వార్డు సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిజిటల్ అసిస్టెంట్ నైట్ ప్యాంటుతో విధులకు హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసి, వెంటనే సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. గడువు తీరిన 11 అర్జీలు పెండింగ్లో ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు.