
తొలి శుభోదయం ప్రకాశం:-
బేస్తవారిపేట మండలం ఎంపీ చెరువు గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న కోడి పందేలపై బేస్తవారిపేట ఎస్ఐ గారి నేతృత్వంలో ఎస్బీ స్టాఫ్తో కలిసి పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో 8 మందిని పట్టుకుని, వారి వద్ద నుండి 6 కోళ్లు, 4 ద్విచక్ర వాహనాలు మరియు రూ.8,100/- నగదును స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన నిందితులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు చట్టానికి లోబడి వ్యవహరించాలని పోలీసులు సూచించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ఇలాంటి దాడులు నిరంతరం కొనసాగుతాయని వెల్లడించారు.