
తొలి శుభోదయం న్యూస్ యర్రగొండపాలెం:-
పవిత్రమైన మహాశివరాత్రి సందర్భంగా శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం కు నూతనంగా నిర్మించిన తారు రోడ్డును ప్రారంభించిన యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు .అనంతరం త్రిపురాంతకంలో ఉన్న శ్రీ బాలా త్రిపురసుందరి దేవి ఆలయం లో అమ్మవారికి, అలాగే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామివారి ఆశీస్సులు పొందారు.