
తొలి శుభోదయం న్యూస్ గిద్దలూరు:-
ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు గిద్దలూరు పట్టణ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు సోమవారం ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కత్తిరించి ఈ చలివేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.. వేసవి కాలంలో ఎండలు మండిపోతున్నాయని, బాటసారులు, సామాన్య ప్రజల సౌకర్యార్థం పురపాలక సంఘం ఈ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని అన్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఇటువంటి మరిన్ని చలివేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీటిని అందించాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం అధికారులు, కౌన్సిలర్లు, స్థానిక నాయకులు మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు._