
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో బిజెపి రాష్ట్ర నాయకులు పి వి కృష్ణారావు మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో మార్కాపురం మున్సిపాలిటీలో ప్రజలు కౌన్సిలర్లని చైర్మన్ ని ఎన్నుకుంటే ఆ ప్రజలకే శాపంగా మున్సిపల్ కౌన్సిల్ తీరు ఉందని కౌన్సిల్ సమావేశాలు జరగక గత 14 నెలలుగా ఎన్నో బిల్లులు ఆగిపోయాయని మార్కాపురం మున్సిపాలిటీలో అభివృద్ధి కుం టుపడిందని దీనికి కారణం సిద్ధాంతాలు పద్ధతులు లేని పార్టీలను ప్రజలు ఎన్నుకోవడమే తప్పైందని మీ ప్రవర్తనల కారణంగా ఎన్నో కుటుంబాలు ఇబ్బందుల పాలవుతున్నాయని మా ఆఫీస్ దృష్టికి కి వచ్చాయని ఇప్పటికైనా మీ పద్ధతులు మీ ప్రవర్తనలు మార్చుకొని మార్కాపురం మున్సిపల్ పరిధిలోని ప్రజల అవసరాలను గుర్తించి ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ పని చేయాలని కోరుచున్నాను మీ మున్సిపల్ అవసరాలు ఏవో రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అధిక నిధులు రాబట్టే ప్రయత్నాలు చేసుకోవాలని కోరుచున్నాను ఈ సమావేశ కార్యక్రమంలో బిజెపి నాయకులు కే శ్రీకాంత్ రామకృష్ణ డి శ్రీను కమల్ మద్దెల ప్రసాద్ నవీన్ బంగారు బాబు వెంకటేశ్వర రెడ్డి లు పాల్గొన్నారు.