
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
మే 2వ తేదీన వైభవంగా జరగనున్న మాల్యాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి ఉత్సవాల ఏర్పాట్లను గురువారం స్వయంగా పరిశీలించాను. ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆలయ అధికారులకు, పోలీస్ సిబ్బందికి పలు కీలక సూచనలు అందజేశాను.అనంతరం ఆలయ సిబ్బందికి యూనిఫామ్లు పంపిణీ చేసి, ఎండల తీవ్రత దృష్ట్యా భక్తుల దాహార్తి తీర్చేందుకు దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ స్వామివారి ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.