
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రజల ప్రాణ భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న ప్రకాశం జిల్లా పోలీసులు ట్రాఫిక్ నియమాల అమలులో కఠిన చర్యలు చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై ఆధునిక సాంకేతికత ఆధారంగా ఈ-చలాన్లు విధిస్తూ కట్టుదిట్టమైన అమలు చర్యలు చేపడుతున్నారు.ట్రాఫిక్ ఉల్లంఘనల వల్ల పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తూ వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని, కార్లలో ప్రయాణించే వారు సీట్బెల్ట్ ధరించడం అత్యవసరమని తెలియజేస్తున్నారు.అదేవిధంగా అధిక వేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, మైనర్ డ్రైవింగ్, రాంగ్ రూట్ ప్రయాణం వంటి ప్రమాదకర చర్యలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు స్పష్టం చేశారు.ప్రజల్లో రోడ్డు భద్రతపై చైతన్యం పెంపొందించేందుకు పబ్లిక్ అవగాహన కార్యక్రమాలు, ప్రచారాలు నిర్వహిస్తూ, ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. సురక్షిత ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పోలీసుల చర్యలకు ప్రజల సహకారం అవసరమని తెలిపారు.ప్రకాశం జిల్లా పోలీసులు ప్రజల భద్రత కోసం నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూ, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఎలాంటి రాజీ లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.