
తొలి శుభోదయం కందుకూరు:-
ఈ సందర్భంగా ఎం.ఐ.జి లేఅవుట్ను పునరుద్ధరించి, దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని మున్సిపాలిటీ అభివృద్ధి పనులకే కేటాయిస్తామని మంత్రిగారు తెలపడం హర్షనీయం. అలాగే, టిడ్కో కాలనీలో నూతన దేవాలయ నిర్మాణానికి టీటీడీ (TTD) ద్వారా రూ. 25 లక్షలు మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించడంతో కాలనీవాసులు పెద్దగా చప్పట్లతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.అనంతరం పట్టణంలోని పామూరు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన డివైడర్ పనులను, సెంట్రల్ లైటింగ్ను మంత్రి పరిశీలించారు. కందుకూరు పట్టణం సుందరంగా తీర్చిదిద్దబడుతోందని నన్ను అభినందిస్తూ.. పట్టణాభివృద్ధి కోసం త్వరలోనే మరో రూ. 30 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన మంత్రికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
