
తొలి శుభోదయం ప్రకాశం / మర్రిపూడి: -
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టిడిపి కార్యకర్తల మృతదేహాలకు నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను ఆదివారం నాడు మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పరామర్శించారు. మర్రిపూడి మండలం తంగెళ్లకు చెందిన టీడీపీ కార్యకర్తలు జడ డేవిడ్, మాతంగి రాకేష్ లు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మంత్రి నేడు తంగేళ్ళ వెళ్లి మృతదేహాలకు నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. జడ డేవిడ్, మాతంగి రాజేష్ ల మృతి బాధాకరమని వారి కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. అనంతరం మర్రిపూడి మండలం గుండ్ల సముద్రంలో మరో కార్యకర్త గుళ్ల నాగార్జున మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు.
