
తొలి శుభోదయం సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో సింగరాయకొండ మండలంలో పాకల గ్రామంలో శ్రీరామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో చివరి రోజున వనభోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది, వనభోజనాల కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు జనసేన పార్టీ నాయకులు వీరమహిళలు పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించి, అయ్యప్ప మాల ధరించిన స్వాములకు మరియు అక్కడికి వచ్చిన భక్తులకు జనసేన పార్టీ నాయకులు వీరమహిళలు భోజనాలు వడ్డించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్, సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, జరుగుమల్లి మండల అధ్యక్షులు గూడా శశిభూషణ్, పొన్నలూరు మండలం నాయకులు పత్తిపాటి మాధవరావు, మిడసల అనిల్, సంకె నాగరాజు మరియు సింగరాయకొండ మండలం నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు.