
తొలి శుభోదయం కందుకూరు:-
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, అది మనందరి సామాజిక బాధ్యత. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు, రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంది.ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని వీధులను శుభ్రం చేయడం, డ్రైనేజీల నిర్వహణ మరియు ప్లాస్టిక్ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాము. ఈ బృహత్తర కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న గ్రామస్తులకు, అధికారులకు మరియు సిబ్బందికి అభినందనలు.