
తొలి శుభోదయం సింగరాయకొండ:-
నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా జరిగిన వ్యాసరచన పోటీలలో జిల్లాలో ద్వితీయ స్థానం సాధించిన గీతం స్కూల్ విద్యార్థిని షేక్ గుల్ షానారా ఈ సందర్భంగా ఒంగోలులో జరిగిన నేషనల్ ఓటర్స్ డే కార్యక్రమంలో గీతం స్కూల్ విద్యార్థినికి జెసి గోపాలకృష్ణ మరియు డీఈవో రేణుక ఆధ్వర్యంలో బహుమతి ప్రధానం చేశారు. ఈ సందర్భంగా గీతం స్కూల్ చైర్మన్ లక్ష్మణ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాలలో విద్యాభివృద్ధిని ప్రోత్సహించాలని నియోజకవర్గంలో ద్వితీయ స్థానం సాధించడంతోపాటు జిల్లాలో ద్వితీయ స్థానం సాధించినందుకు విద్యార్థినికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తాజుద్దీన్ పాల్గొన్నారు.