
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ:-
అనుమానాస్పద స్థితిలో సింగరాయకొండ శ్రీ చైతన్య ప్రాథమికోన్నత పాఠశాల కి అనుబంధంగా నడుస్తున్న శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ ఆరవ తరగతి విద్యార్థి తౌషిక్ మృతి సంఘటన తో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో త్రి సభ్య కమిటీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన నివేదిక తో జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక చర్యలకు ఉపక్రమించారు. పొందిన అనుమతి కి భిన్నంగా వ్యవహరిస్తే నిర్వాహకులు పాఠశాలను నిర్వహిస్తున్నట్లు త్రిసభ్య కమిటీ విచారణ సందర్భంగా గుర్తించిందని ఆమె తెలిపారు. అనుమతి పొందిన పాఠశాలలో దీనికి అనుబంధంగా నిర్వహిస్తున్న నవోదయ కోచింగ్ సెంటర్ లో ఆరవ తరగతి విద్యార్థి తౌషిక్ వసతి గృహం బాత్ రూం లో అనుమానాస్పదంగా ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన సంచలనం అయింది. విద్యార్థి మృత దేహాన్ని స్కూల్ ఎదుట తల్లి దండ్రులు చేస్తున్న ఆందోళన విద్యాశాఖ అధికారి, పోలీస్ చర్యల కారణంగా మృత దేహాన్ని ఒంగోలు రిమ్స్ కి తరలించేందుకు వీలుంకలిగింది. తల్లి దండ్రులు, బంధువులు, ప్రజాసంఘాలు, సి పి ఐ రాష్ట్ర కార్యదర్శి చేపట్టిన ఆందోళన జిల్లా కేంద్రం, రాష్ట్ర రాజధానిని తాకింది. దానితో ప్రభుత్వ పెద్దల నుండి వస్తున్న వత్తిడి, త్రి మెన్ కమిటీ నివేదిక కలెక్టర్ ఆదేశాలతో జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక సదరు పాఠశాల నిర్వాహకులకు వివరణ కోరుతూ సమాధానం ఇవ్వాలని కోరారు. కానీ సదరు పాఠశాల యాజమాన్యం గడువు లోపు షోకాజ్ నోటీసు కి సమాధానం ఇవ్వక పోవడం తో జిల్లా విద్యాశాఖ అధికారి రేణుక ఒక అడుగు ముందుకు వేసి 2026 - 27 సంవత్సరం నుండి శ్రీ చైతన్య ప్రాథమికోన్నత పాఠశాల కి జిల్లా విద్యా శాఖ నుండి పొందిన అనుమతి రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. నేర నిర్ధారణకు పోలీస్ చేపట్టిన చర్యలు, శవ పరీక్ష నివేదిక పై తౌషిక్ బంధువులు, తల్లిదండ్రులు ఆందోళన కొనసాగించడం, పోలీస్ లు శవ పరీక్ష నివేదిక ఊపిరి ఆడకపోవడం బలవన్మరణానికి కారణం అయినట్లు ప్రకటించిన నేపద్యం లో విద్యాశాఖ పాఠశాల అనుమతి రద్దు చేయడం తో అనేక అనుమానాలతో ప్రజలు, ప్రజా సంఘాలు, వామ పక్షాలు పలు రకాలుగా చర్చించు కుంటున్నారు.
