
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
ప్రకాశం జిల్లా , సింగరాయకొండ మండలం, చెల్లెమ్మ గారి పట్టపు పాలెం లో మత్స్యకారుల సమస్యల గురించి, సముద్ర తీర భద్రత గురించి కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ విశాఖపట్నం వారి ఉత్తర్ల మేరకు శివన్నారాయణ ,ఈశ్వరయ్య వారి సిబ్బంది సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాటి సంరక్షణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న సముద్ర తీరం వెంబడి తాటి చెట్ల పెంపకం వాటి ఉపయోగాలు మరియు సముద్రంలో వేటకు వెళ్ళినప్పుడు కొత్త వ్యక్తులు లేక అనుమానాలస్పద బూట్లు కనిపించిన ఫోన్ చేయవలసిన టోల్ ఫ్రీ నెంబర్లు మరియు బోట్లు రిజిస్ట్రేషన్ వేటకు వెళ్ళినప్పుడు లైఫ్ జాకెట్స్ ధరించాలని ఇలాంటి విషయాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్దకాపు మరియు చెల్లమ్మ గారి పట్టపు పాల గ్రామ పెద్దలు పాల్గొన్నారు.