
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కాకతీయ కళ్యాణ మండపం నందు గీతం స్కూల్ విద్యార్థులు నూతన కాలానికి అనుగుణంగా కోడింగ్ కార్వాన్, హెక్టాన్, రోబోటిక్స్, వివిధ రకాల సైన్స్ ఎక్స్పోను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ హాజరై విద్యార్థులు చేసిన వివిధ రకాల సైన్స్ ఎక్స్పో లను సందర్శించారు . ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో వారు చేసిన ప్రయోగాల గురించి అడిగి తెలుసుకుని విద్యార్థులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ లక్ష్మణ్, ప్రిన్సిపాల్ తాజుద్దీన్ , ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.