
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా, తెలుగుదేశం పార్టీ నాయకులు మధిర మధు తన తండ్రి మాజీ విశ్వబ్రాహ్మణ సంఘం ప్రెసిడెంట్ మధిర వీరబ్రహ్మచారి గారి జ్ఞాపకార్థం ఏరియా ఆసుపత్రికి ₹29,000 విలువ చేసే వైద్య సామగ్రిని అందజేశారు.ఈ సందర్భంగా నెబులైజర్లు, డ్రెస్సింగ్ బిన్స్ మరియు రెండు వోల్టాస్ వాటర్ కూలర్లు ఆసుపత్రి వినియోగార్థం సమర్పించబడినవి. ఆసుపత్రి సేవల మెరుగుదలకు ఈ సామగ్రి ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు, మధిర మధు చేసిన సేవలను అభినందిస్తూ, సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.