
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయండి అంటూ టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో ప్రచార ర్యాలీ నిర్వహిస్తున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రవేశాల కొరకు జరిగిన ప్రచార కార్యక్రమంలొ భాగంగా గత మూడు రోజులుగా ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు గ్రామంలో ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులను చైతన్య పరుస్తున్నారు.విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, పాఠశాల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలు,గ్రామస్థుల సహకారం వారికి వివరిస్తున్నారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాతం శ్రీనివాసరావు నేతృత్వంలో ఉపాధ్యాయులు,పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్ కొల్లూరి సుధాకర్, యం.పి.టి.సి. పమిడి నాగేశ్వరరావు, స్థానిక ఉపాధ్యాయుడు కాట్రగడ్డ చంద్రమౌళి, కప్పగంతు జయరామయ్య తదితరులు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.