google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :-
ప్రజలందరూ యోగాను మంగళవారం కార్యక్రమంగా కాకుండా, తమ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకొని జీవన విధానంగా మార్చుకోవాలి.అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21)ను పురస్కరించుకుని ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి పిలుపుమేరకు,రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర–2026 కార్యక్రమాన్ని ఈరోజు విడవలూరు మండలం రామతీర్థం సాగర తీరం వద్ద నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ శ్రీ హిమాన్షు శుక్లా గారితో కలిసి పాల్గొన్నాను.అందమైన సాగర తీరంలో ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించిన సామూహిక యోగా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. మన జీవనశైలిలో, ఒత్తిడి లేని జీవితం కోసం ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలనేది మన సిఎంగారి ముఖ్య ఉద్దేశం.