ఎడిటర్:పసుమర్తి జాలయ్య | ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ | Cell : +91 9390399948 June 23, 2026, 12:01 am
రైతన్న మీకోసం వారోత్సవాలు 22 జూన్ నుండి 27 జూన్ వరకు నిర్వహించబడును

తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
వ్యవసాయ శాఖ వారు, రైతన్న మీకోసం వారోత్సవాలు 22 జూన్ నుండి 27 జూన్ వరకు నిర్వహించుట జరుగుచున్నది. ఇందులో భాగంగా సోమవారం అనగా 22 జూన్ సింగరాయకొండ మండలం అన్ని గ్రామాల్లో రైతన్న మీకు కోసం కార్యక్రమం నిర్వహించుట జరిగినది.
దీని యొక్క ముఖ్య ఉద్దేశం 1. ఏపీ ఎయిమ్స్ విధానం ద్వారా యూరియా డి ఏ పి ఎరువుల విక్రయం కొనసాగుతుందని తెలియజేయడమైనది
- రైతు ఆధార్ కార్డు ద్వారా పిఎసిఎస్ లేదా ఇతర రిటైల్ దుకాణాల ద్వారా ఎరువులు పొందవచ్చు ఆధార్ కార్డులో అనుసంధానమైన మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటీపీ ద్వారా ఈ కొనుగోలు ధ్రువీకరించబడుతుంది
ఎరువుల కొనుగోలు సమయంలో తప్పనిసరిగా రసీదు పొందవలెను అవసరానికి మించి ఎరువులు వాడకం తగ్గించాలని చెప్పి తెలియజేయడమైనది పచ్చి రొట్టె సేంద్రియ ఎరువులు వాడకం ద్వారా రసాయన ఎరువులు కొంతమేర తగ్గించవచ్చని తెలియజేయడమైనది ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి టీ పూర్ణచంద్రరావు ఏ ఈ ఓ నజమా అగ్రికల్చర్ అసిస్టెంట్ శారద పాల్గొనడం జరిగింది
https://www.tholisubhodayam.com